
బెస్ట్ అవైలబుల్ పథకం కింద విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి పిర్యాదు చేశారు. ఈ మేరకు వారు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.



















