
ఫజమెటనెటనేడచేనడమడచేతూ,ఈనె30తేనషటతగజతనచచ.నజమోనహచనేమేోజఅధషడనతేతఈనెడచ.

ఫజమెటనెటనేడచేనడమడచేతూ,ఈనె30తేనషటతగజతనచచ.నజమోనహచనేమేోజఅధషడనతేతఈనెడచ.

రెవెన్యూ రికార్డుల తారుమారు, అవకతవకలపై శాఖాపరమైన విచారణ

నందిపేట్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 3 టిప్పర్లు, ఒక హిటాచీ, 200 కెపాసిటీ గల చైన్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు కఠిన తనిఖీలు చేపట్టినా, మందుబాబుల తీరు మారడం లేదు. గత రెండు వారాల్లో 426 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో కొందరికి జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలు కూడా విధించారు.

ఆధార్ వినియోగదారులకు శుభవార్త. జూలై 1, 2026 నుంచి ఆధార్లో ఈమెయిల్ అడ్రస్ను అప్డేట్ చేసుకునే సేవను ఆరు నెలల పాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ఆధార్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సేవకు వసూలు చేస్తున్న రూ.75 ఫీజును తాత్కాలికంగా రద్దు చేసింది.

'మన ఊరు - మన భద్రత' కార్యక్రమంలో భాగంగా మెండోరాలో భారీ ర్యాలీ నిర్వహించారు. యువతను గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని ఎస్సై సుహాసిని సూచించారు.

డివిజన్ నెంబర్ 10 కార్పొరేటర్ మొహమ్మద్ అన్వర్, రాబోయే వర్షాకాలం దృష్ట్యా కాలనీవాసుల సౌకర్యార్థం కాలువల తవ్వకం పనులను ముమ్మరంగా చేపడుతున్నారు. తన సొంత ఖర్చులతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నందిపేట మండల కేంద్రంలో పూజా పూలను చెరువులో నిమజ్జనం చేయడానికి వెళ్లిన ఓ మహిళ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

నందిపేట బస్టాండ్లో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 87 ఏళ్ల వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీకి గురైంది. పోలీసులు బస్సును పోలీస్స్టేషన్కు తరలించి తనిఖీలు నిర్వహించినా, ఆభరణం లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్ సామాజిక కార్యకర్త, న్యాయవాది మహ్మద్ జునైద్ అలీసాహెబ్, థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరగనున్న 7వ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ & SDG సినర్జీస్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సదస్సు ఐక్యరాజ్యసమితి ESCAP మరియు DESAల సహకారంతో జూన్ 29-30, 2026న జరగనుంది.

మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులోగల NH 44 రోడ్డుపై 21.06.2026 రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

నేటి సమాజంలో విద్యార్థినిలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, అందుకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి సూచించారు. కాకతీయ ఇంజనీరింగ్ మహిళా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాన్ని తట్టుకోలేక నందిపేట మండల కేంద్రానికి చెందిన హార్డ్వేర్ వ్యాపారి ఎర్రం పవన్ కుమార్ (45) ఆత్మహత్యకు పాల్పడ్డారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

నిజామాబాద్ నగర శివారులో మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద నిర్మించిన అరణ్య అర్బన్ పార్క్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి, పార్కులోని సదుపాయాలను పరిశీలించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి, నగర అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రాధాన్యతనిస్తూ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ నిజామాబాద్లోని 3, 7, 39 డివిజన్లలో గురువారం విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ జెండాను ఎడపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అమలు చేస్తామని పార్టీ నాయకులు ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలో రాత్రి వేళల్లో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మూడో టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.

నిజామాబాద్ పట్టణంలోని శాంతినగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడైన రియాజ్ ఖాన్ (33)ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.1.10 లక్షల నగదుతో పాటు దొంగతనానికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో ‘ఇందిరమ్మ ఇండ్లు’ పథకం రెండో విడతలో గుడిసెల్లో నివసించే నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.

పారదర్శకమైన ఎరువుల పంపిణీ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నిజామాబాద్ జిల్లా రైతులు రాష్ట్రంలోనే అత్యధికంగా యూరియా కొనుగోలు చేశారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. జిల్లాలో యూరియా విక్రయాలన్నీ ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయని, దీనివల్ల అవకతవకలకు తావులేకుండా పంపిణీ జరుగుతోందని ఆమె తెలిపారు.