
నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని నగర మేయర్ ఉమారాణి అన్నారు. శుక్రవారం ఆమె నిజామాబాద్ నగరంలోని 12వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.



















